ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2021-06-18T04:18:11+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు
ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

  • కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా  జైపాల్‌ యాదవ్‌ 


తలకొండపల్లి : ధాన్యం కొనుగోళ్లలో అలసత్వానికి తావివ్వొద్దని, చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జిన్నింగ్‌ మిల్లును ఎమ్మెల్యే పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండాచూడాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను సింగిల్‌విండో చైర్మన్‌ గట్ల కేశవరెడ్డి, జిల్లా సహకార అసిస్టెంట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ శారద, ఏవో రాజులను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విజిలెన్స్‌ టీంలు ఏర్పాటు చేశామని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దశరథ్‌ నాయక్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింహ, నాయకులు జగన్‌ రెడ్డి, పాండు, రమేశ్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:18:11+05:30 IST