మా గ్రామంలో ప్రాజెక్టు కాలువ నిర్మించొద్దు
ABN , First Publish Date - 2021-01-17T05:06:43+05:30 IST
సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి గ్రామంలో శనివారంం సర్పంచ్ చందిరెడ్డి రఘోత్తంరెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
చిన్నగుండవెల్లి గ్రామసభలో తీర్మానం
సిద్దిపేట రూరల్, జనవరి 16 : సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి గ్రామంలో శనివారంం సర్పంచ్ చందిరెడ్డి రఘోత్తంరెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ పరిధిలో ఇప్పటికే అండర్ టన్నెల్ నిర్మించారని, హై టెన్షన్ విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎకరాల కొద్దీ వ్యవసాయ భూమి కోల్పోయామని, ఇప్పుడు 300 మీటర్ల వెడల్పుతో ఓపెన్ కెనాల్ నిర్మించేందుకు ప్రభుత్వం భూ సేకరణకు సర్వే చేస్తున్నదని రైతులు సభలో వివరించారు. దాంతో గ్రామ పరిధిలోని వ్యవసాయ భూముల నుంచి అండర్ టన్నెల్, కెనాల్, సబ్ కెనాల్ వంటి నిర్మాణాలు చేపట్టవద్దని, భూసేకరణకు సర్వే చేయొద్దని తీర్మానించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కోటగిరి శ్రీహరిగౌడ్, ఎంపీటీసీ సరస్వతీనారాగౌడ్, ఉపసర్పంచ్ మహేశ్వర్రెడ్డి, వార్డుసభ్యులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పటేల్రెడ్డి, రైతులు, పంచాయతీ కార్యదర్శి చంద్రలేఖ పాల్గొన్నారు.