వన్యప్రాణాలకు హాని తలపెట్టొద్దు

ABN , First Publish Date - 2020-08-13T07:52:11+05:30 IST

వన్యప్రాణులు పొలాలు, జనావాసాల వైపు వచ్చిన వెంటనే తమకు సమాచారమివ్వాలే తప్ప వాటికి హానీ తలపెట్టొద్దని అటవీ ఇన్‌చార్జి క్షేత్రాధికారి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ననియాలలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో బుధవారం అటవీశాఖ వారు ప్రపంచ ఏనుగు

వన్యప్రాణాలకు హాని తలపెట్టొద్దు

కుప్పం అటవీ అధికారి కృష్ణప్రసాద్‌ 


రామకుప్పం, ఆగస్టు 12:  వన్యప్రాణులు పొలాలు, జనావాసాల వైపు వచ్చిన వెంటనే తమకు సమాచారమివ్వాలే తప్ప వాటికి హానీ తలపెట్టొద్దని అటవీ ఇన్‌చార్జి క్షేత్రాధికారి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ననియాలలోని కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రంలో బుధవారం అటవీశాఖ వారు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించారు.


ఈ కేంద్రంలోని ఏనుగులు జయంత్‌, గణేష్‌లకు మావటీలు, ట్రాకర్లు స్నానాలు చేయించి, వాటిని రంగులతో తీర్చిదిద్ది పూజలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఎవ్వరూ తమ పొలాల వద్ద విద్యుత్‌తీగలు ఏర్పాటు చేయరాదన్నారు. కార్యక్రమంలో అటవీ విభాగాధికారి గౌస్‌కరీం, బీట్‌ అధికారులు రాజశేఖర్‌, కుప్పుస్వామి, రాధాకృష్ణ, రవి, సుధాకర్‌, ట్రాకర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-13T07:52:11+05:30 IST