క్రిమినల్‌ కేసుల్లో ఉన్న వారికి పదోన్నతులివ్వొద్దు

ABN , First Publish Date - 2021-01-18T08:59:44+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుండడం హర్షణీయమే అయినా.. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారికి పదోన్నతులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఎస్సీ, ఎస్టీ సంఘాలు

క్రిమినల్‌ కేసుల్లో ఉన్న వారికి పదోన్నతులివ్వొద్దు

ఎస్సీ, ఎస్టీ సంఘాల డిమాండ్‌


ఖైరతాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుండడం హర్షణీయమే అయినా.. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారికి పదోన్నతులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తామని ఎస్సీ, ఎస్టీ సంఘాలు తెలిపాయి. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఎస్సీ కులాల సంక్షేమ సంఘం, మాల సంక్షేమ సంఘాలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల అధ్యక్షులు ఎ.రాంబాబు, రాంప్రసాద్‌లు మాట్లాడారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.రఘువీరారెడ్డి అనే అధికారి క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్నారని వారు అన్నారు. 

Updated Date - 2021-01-18T08:59:44+05:30 IST