గిరిజన హక్కులకు భంగం కలిగించొద్దు
ABN , First Publish Date - 2021-03-01T05:34:55+05:30 IST
గిరిజన హక్కులకు భంగం కలిగించొద్దు
గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 28: గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ, తదితర గ్రామాల్లో గిరిజన హక్కు లకు భంగం వాటిల్లితే సహించమని సర్పంచ్ బొత్తాడ గౌరీశంకరరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ షెడ్యూల్ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టానికి అనుగుణంగానే గిరిజనేతరులు ఉండాల న్నారు. గుమ్మలక్ష్మీపురంలో పలు గిరిజన కుటుంబాలు సొంత ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారని, వీరితో పాటు పూర్వం నుంచి గిరిజనేతర కుటుంబాలు కూడా ఉంటు న్నాయని తెలిపారు. ఇకపై గిరిజన ప్రాంతానికి కొత్తగా ఎవరైనా గిరిజనేతరులు వచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపడితే సహించేది లేదన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని సర్పంచ్ గౌరీశంకర్రావు తెలిపారు. గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కులు, గిరిజన భూములు అన్యా క్రాంతం కాకుండా చూస్తామన్నారు.