దగాకోరు పీఆర్సీ మాకొద్దు
ABN , First Publish Date - 2022-01-15T06:20:05+05:30 IST
దగాకోరు పీఆర్సీ వద్దని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు గుడివాడ డివిజిన్ నేతలు సత్యన్నారాయణ పురంలో భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులను శుక్రవారం తగులబుట్టారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో భోగి మంటల్లో ఉత్తర్వులు
గుడివాడ(రాజేంద్రనగర్): దగాకోరు పీఆర్సీ వద్దని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు గుడివాడ డివిజిన్ నేతలు సత్యన్నారాయణ పురంలో భోగి మంటల్లో పీఆర్సీ ప్రతులను శుక్రవారం తగులబుట్టారు. వారు మాట్లాడుతూ అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టును బహిర్గతం చేసి ఘనమైన పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఈ నెల 20న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సెక్రటరీ జనరల్ కుంపటి రాజేంద్ర ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు నీలం ప్రభాకర్ రావు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్ర ప్రసాద్, సీపీఎస్ కన్వీనర్ శ్రీనాఽథ్, గాంధీ, తాతబాబు పాల్గొన్నారు.