పాఠశాలను విలీనం చేయవద్దు

ABN , First Publish Date - 2022-01-21T05:25:21+05:30 IST

మండలంలోని మహంతిపాలెం యూపీ స్కూల్‌ను గొర్లెపేట హైస్కూల్‌లో విలీనం చేయవద్దంటూ మహంతిపాలెం గ్రామస్థులు గురువా రం ఎంపీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

పాఠశాలను విలీనం చేయవద్దు
ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు


 మహంతిపాలెం గ్రామస్థుల ఆందోళన  
రణస్థలం:
మండలంలోని మహంతిపాలెం యూపీ స్కూల్‌ను గొర్లెపేట హైస్కూల్‌లో విలీనం చేయవద్దంటూ మహంతిపాలెం గ్రామస్థులు గురువా రం ఎంపీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.  ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామ న్నారు. ఇప్పుడు 3 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 130 మంది విద్యా ర్థులను సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గొర్లెపేట హైస్కూల్‌కు పంపించడం తగదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఆలోచనను ప్రభుత్వం మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించమన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-01-21T05:25:21+05:30 IST