పాఠశాలను తరలించొద్దు

ABN , First Publish Date - 2022-01-18T05:26:50+05:30 IST

రాజులగుమ్మడ ప్రాథమిక పాఠశాలను వీవీఆర్‌పేట జడ్పీ పాఠశాలలో విలీనం చేసే ఆలోచనను విరమించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.

పాఠశాలను తరలించొద్దు
పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్థులు


  రాజుల గుమ్మడ  స్కూల్‌ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన 

వంగర, జనవరి 17: రాజులగుమ్మడ ప్రాథమిక పాఠశాలను వీవీఆర్‌పేట జడ్పీ పాఠశాలలో విలీనం చేసే ఆలోచనను విరమించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాలకు చేరుకున్న గ్రామస్థులు సుదర్శనరావు, అప్పలనాయుడు, వెంకట నాయుడు తదితరులు ప్రధానోపాధ్యాయుడు అప్పారావుతో చర్చించారు. మా పాఠశాల తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయమై స్పష్టత కావాలన్నారు. దీంతో ఆయన సమాధానమిస్తూ ఇది ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తంచేసి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ నినాదాలు చేశారు. తక్షణం ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం హెచ్‌ఎంకు వినతిపత్రం అందించారు. 

 

Updated Date - 2022-01-18T05:26:50+05:30 IST