వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే దాకా బడులు తెరవొద్దు: షర్మిల

ABN , First Publish Date - 2021-06-22T09:26:10+05:30 IST

రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకూ బడులు తెరవొద్దని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ తన నిర్ణయా న్ని మార్చుకోవాలని షర్మిల డిమాండ్‌ చేశారు.

వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే దాకా బడులు తెరవొద్దు: షర్మిల

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకూ బడులు తెరవొద్దని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ తన నిర్ణయా న్ని మార్చుకోవాలని షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేర కు సోమవారం ఆమె ట్వీట్‌ చేశారు. పిల్లలకు కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉండగా బడులు తెరిచి వి ద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. కాగా, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్థంతి సందర్భంగా లోటస్‌ పాండ్‌లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.  

Updated Date - 2021-06-22T09:26:10+05:30 IST