వ్యాక్సినేషన్ పూర్తయ్యే దాకా బడులు తెరవొద్దు: షర్మిల
ABN , First Publish Date - 2021-06-22T09:26:10+05:30 IST
రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ బడులు తెరవొద్దని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ తన నిర్ణయా న్ని మార్చుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ బడులు తెరవొద్దని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ తన నిర్ణయా న్ని మార్చుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేర కు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. పిల్లలకు కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండగా బడులు తెరిచి వి ద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. కాగా, ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా లోటస్ పాండ్లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.