వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ షేరింగ్ వద్దు
ABN , First Publish Date - 2021-05-29T08:46:36+05:30 IST
కొవిడ్ వ్యాక్సినేషన్ తరవాత జారీ చేసిన సర్టిఫికెట్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. అందులో పేరు, వయస్సు, ఆధార్ నంబర్ సహా
కొవిడ్ వ్యాక్సినేషన్ తరవాత జారీ చేసిన సర్టిఫికెట్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. అందులో పేరు, వయస్సు, ఆధార్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలు ఉంటాయని, వాటిని మోసగాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది.
వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న తరవాత ఆరోగ్యసేతు యాప్ లేదంటే కొవిన్ పోర్టల్ ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికెట్ జనరేట్ చేసుకోవచ్చు. రెండో వ్యాక్సినేషన్ తరవాత అసలు సర్టిఫికెట్ అందుతుంది. విదేశీ ప్రయాణాలు సహా భవిష్యత్తులో పలు అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. దరిమిలా దుర్వినియోగానికి అవకాశాలు మెండుగా ఉన్నందున, సర్టిఫికెట్ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరింది.