కార్లలో తిరగొద్దు... కంగన రనౌత్ షాకింగ్ కామెంట్స్...

ABN , First Publish Date - 2021-11-03T17:51:09+05:30 IST

దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు

కార్లలో తిరగొద్దు... కంగన రనౌత్ షాకింగ్ కామెంట్స్...

ముంబై : దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 


కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు చూసేవాడినని, ఆ తర్వాత కాల్చడం కోసం కొన్ని టపాకాయలను దాచుకునేవాడినని చెప్పారు. 


కంగన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సద్గురు మాటలను ప్రస్తావించారు. సద్గురు లక్షలాది చెట్లను నాటించి, హరిత హారాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారని తెలిపారు. ‘‘దీపావళి పర్యావరణ ఉద్యమకారులకు సరైన సమాధానం ఏమిటంటే, మూడు రోజులపాటు కార్లను వాడటం మానేసి, మీ కార్యాలయాలకు నడిచి వెళ్ళండి’’ అని సలహా ఇచ్చారు. 


Updated Date - 2021-11-03T17:51:09+05:30 IST