పుష్పగుచ్ఛాలు, స్వీట్లు వద్దు
ABN , First Publish Date - 2021-10-22T07:16:41+05:30 IST
కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చే సందర్శకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, స్వీటు బాక్సులు ఇస్తుంటారు.
నోట్పుస్తకాలు, పెన్నులు తీసుకురండి
కలెక్టర్ పమేలాసత్పథి
యాదాద్రి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చే సందర్శకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలు, స్వీటు బాక్సులు ఇస్తుంటారు. అయితే ఇకపై వీటిని తీసుకునేది లేదని కలెక్టర్ పమేలాసత్పథి నిర్ణయం తీసుకున్నారు. వాటికి బదులుగా, పేద విద్యార్థులకు అందజేసేందుకు నోటు పుస్తకాలు, పెన్నులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కోసం రెయిన్కోట్లు, పేదలకు పంపిణీ చేసేందుకు దుప్పట్లు తీసుకొస్తే తీసుకుంటామని తెలియచేస్తూ కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ఆమె బోర్డు ఏర్పాటు చేయించారు. కాగా, కలెక్టర్ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.