అక్రమ భవనాలు మీకు కనపడవా.!

ABN , First Publish Date - 2021-07-30T05:57:45+05:30 IST

‘బాడాబాబులు కబ్జా చేసిన కోట్ల విలువైన భూములు మీకు కనబడవు... కాని పేదలు ఒక సెంట్‌లో గుడిసె వేసుకుంటే వెంటనే వచ్చి కూల్చేస్తారా.. వాళ్లకొక న్యాయం.. వీళ్లకొక న్యాయమా..’ అని బైపా్‌స రోడ్డులోని ఆటోనగర్‌ వద్ద ఉన్న గుడిసె వాసులు, బీజేపీ నాయకులు ఆర్‌ అండ్‌ బీ అధికారులను గురువారం నిలదీశారు

అక్రమ భవనాలు మీకు కనపడవా.!
ఆర్‌అండ్‌బీ అధికారులను నిలదీస్తున్న బీజేపీ నాయకులు

గుడిసెలనే తొలగిస్తారా..?:  అధికారులను నిలదీసిన పేదలు, బీజేపీ

హిందూపురం టౌన్‌, జూలై 29: ‘బాడాబాబులు కబ్జా చేసిన కోట్ల విలువైన భూములు మీకు కనబడవు... కాని పేదలు ఒక సెంట్‌లో గుడిసె వేసుకుంటే వెంటనే వచ్చి కూల్చేస్తారా.. వాళ్లకొక న్యాయం.. వీళ్లకొక న్యాయమా..’ అని  బైపా్‌స రోడ్డులోని ఆటోనగర్‌ వద్ద ఉన్న గుడిసె వాసులు, బీజేపీ నాయకులు ఆర్‌ అండ్‌ బీ అధికారులను గురువారం నిలదీశారు. గురువారం ఆటోనగర్‌ వద్ద రోడ్డు వెడల్పు పేరుతో పేదల గుడిసెలు తొలగించేందుకు అధికారులు రాగా స్థానికులు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు రమే్‌షరెడ్డి, రమణమూర్తి అక్కడకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఇష్టానుసారంగా రోడ్డు వెడల్పు పేరుతో పేదలను బెదిరించడం సరి కాదన్నారు. కార్యక్రమంలో స్థానికులు శ్రీనివాసులు, మూర్తి, చంద్ర, నగేష్‌, ప్రసాద్‌, కళ్యాణ్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-07-30T05:57:45+05:30 IST