హైదరాబాద్ కేపీహెచ్బీకాలనీలో డాక్టర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-09-13T00:19:34+05:30 IST
హైదరాబాద్ కేపీహెచ్బీకాలనీలో డాక్టర్ ఆత్మహత్య
హైదరాబాద్: కేపీహెచ్బీకాలనీ సితార గ్రాండ్ హోటల్లో డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్లో పిల్లల వైద్యుడిగా చంద్రశేఖర్ పని చేస్తున్నారు. మెదక్ కారు దగ్ధం కేసులో ఆయనపై ఆరోపణలున్నాయి. కుమారుడిని నీట్ పరీక్ష రాయించేందుకు కుటుంబంతో కలిసి చంద్రశేఖర్ హైదరాబాద్ వచ్చారు. భార్య, కొడుకును పరీక్షా కేంద్రానికి పంపి చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. హోటలల్ సితార రూమ్ నెంబర్ 314లో ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.