సుధాకర్ కేసులో డాక్టర్ మార్పు

ABN , First Publish Date - 2020-05-31T17:34:55+05:30 IST

సుధాకర్‌కు చికిత్స చేస్తున్నమానసిక ఆస్పత్రి డాక్టర్ రామిరెడ్డిని మార్చారు.

సుధాకర్ కేసులో డాక్టర్ మార్పు

విశాఖ: సుధాకర్‌కు చికిత్స చేస్తున్నమానసిక ఆస్పత్రి డాక్టర్ రామిరెడ్డిని మార్చారు. ఆయన స్థానంలో ఓ మహిళా డాక్టర్‌ను నియమించారు. శనివారం సాయంత్రమే రామిరెడ్డిని మార్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాధారాణి తెలిపారు. ఆయన స్థానంలో డాక్టర్ సుహాసిని నియమించినట్లు చెప్పారు. తనకు సంబంధంలేని మెడిసిన్ ఇస్తున్నారని సుధాకర్ ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు రావాల్సిన డాక్టర్.. 15 రోజుల్లో రెండు సార్లు మాత్రమే వచ్చారని, అతని ప్రవర్తన సరిగాలేదని, తనను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని సుధాకర్ ఆరోపిస్తూ లేఖ కూడా రాశారు.


ఈ నేపథ్యంలో సుధాకర్ తల్లి కావేరి భాయ్ కూడా డాక్టర్ రామిరెడ్డిపై ఆరోపణలు చేశారు. తన కొడిక్కి స్లో పాయిజన్ ఇస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే డాక్టర్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. తన కొడుకు రోజు రోజుకు కుచించుకుపోతున్నాడని, శరీరం మెత్తబడుతోందని, కురుపులు వస్తున్నాయని, ఆరోగ్యపరిస్థితి బాగోలేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి సూపరింటెండెంట్ రామిరెడ్డిని మార్చినట్లు సమాచారం. మరోవైపు సీబీఐ అధికారులు సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అసలు మొదటి నుంచి ఏం జరిగిందన్నదానిపై వివరణ అడుగుతూ వాంగ్మూలం తీసుకున్నారు.

Updated Date - 2020-05-31T17:34:55+05:30 IST