వైద్యులు, సిబ్బంది సేవలు అమోఘం

ABN , First Publish Date - 2020-06-01T10:00:40+05:30 IST

కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది సేవలు అమో ఘమని ఎస్‌బీఐ

వైద్యులు, సిబ్బంది సేవలు అమోఘం

ఎస్‌బీఐ ఆర్‌ఎం సాంబమూర్తి

రూ.3.5లక్షల విలువ చేసే పీపీఈ కిట్లు, ఎన్‌95, శానిటైజర్లు అందజేత


అనంతపురం క్లాక్‌టవర్‌, మే 31 : కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది సేవలు అమో ఘమని ఎస్‌బీఐ ఆర్‌ఎం సాంబమూర్తి తెలిపారు. రూ.3.5 లక్షలు విలువ చేసే పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్కులు, శానిటైజర్లను ఆదివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రామస్వామినాయక్‌కు ఎస్‌బీఐ అధికారులు అందజేశారు. సంస్థాగత సామాజిక బాధ్యతగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి తమ వంతుగా రక్షణ పరికరాలు అందజేశామని ఆర్‌ఎం తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఏజీఎం శ్రీకాంత్‌, ఆర్‌ఎంఓ గోపాలకృష్ణ నాయక్‌, కోవిడ్‌ ఎంపీహె చ్‌ఈఓ లక్ష్మానాయక్‌, ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, మేనేజర్లు నరేంద్రరెడ్డి, పవన్‌గోపాల కృష్ణ, మహేష్‌, తిరుపాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-01T10:00:40+05:30 IST