ఆ రేసులో పాల్గొనొద్దు
ABN , First Publish Date - 2020-11-28T09:09:48+05:30 IST
దేశ రాజధానిలో ఆదివారం జరిగే హాఫ్ మారథాన్ రేసులో పాల్గొనవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ విజృంభణ, అక్కడి వాయు కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఆ రేసులో పోటీపడడం అంత శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ
- ఢిల్లీ హాఫ్ మారథాన్పై వైద్యుల హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం జరిగే హాఫ్ మారథాన్ రేసులో పాల్గొనవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ విజృంభణ, అక్కడి వాయు కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఆ రేసులో పోటీపడడం అంత శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి 21 కిలోమీటర్లు సాగే ఈ రేసులో మహిళల మారథాన్ ప్రపంచ రికార్డు గ్రహీత బ్రిగిడ్ కోస్గీ (కెన్యా), పురుషుల విభాగంలో అందామ్లక్ బెలిహు (ఇథియోపియా), 49 మంది ఎలైట్ రన్నర్లు ఈ రేసులో పోటీపడనున్నారు.