అలంపూర్లో డాక్యుమెంటరీ షూటింగ్
ABN , First Publish Date - 2022-07-22T05:23:44+05:30 IST
అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సమీపంలోని తుంగ భద్ర పుష్కరఘాట్ వద్ద గురువారం డాక్యుమెంటరీ షూటింగ్ జరిగింది.
- పుష్కరఘాట్ వద్ద సన్నివేశాల చిత్రీకరణ
- పాల్గొన్న హీరోయిన్ ప్రియమణి, విలన్ సంజయ్
అలంపూరు, జూలై 21 : అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల సమీపంలోని తుంగ భద్ర పుష్కరఘాట్ వద్ద గురువారం డాక్యుమెంటరీ షూటింగ్ జరిగింది. దర్శకుడు బీవీ రవి, కౌముది ఆధ్వ ర్యంలో హీరోయిన్ ప్రియమణి, విలన్ సంజయ్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఉదయం తుంగభద్ర నదిలో ప్రియమణి సూర్యుడికి నమస్కరిస్తూ పుణ్య స్నానం చేసే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ దేశంలోని 18 శక్తి పీఠాల చరిత్రపై డాక్యుమెంటరీ తీస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు తొమ్మిది శక్తి పీఠాల్లో షూటింగ్ పూర్తయ్యిందని చెప్పారు. అలంపూర్ ఆలయాల సమీ పంలోని మ్యూజియంలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించామన్నారు. ఇంకా టైటిల్ను నిర్ధారించలేదని తెలిపారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల ఆలయాల్లో నటీనటులు, యూనిట్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. షూటింగ్ చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.