దొడ్ల డెయిరీ చేతికి శ్రీకృష్ణ మిల్క్స్
ABN , First Publish Date - 2022-03-20T06:04:50+05:30 IST
కర్ణాటకకు చెందిన శ్రీ కృష్ణ మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను దొడ్ల డెయిరీ రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి....
రూ.50 కోట్లకు కొనుగోలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కర్ణాటకకు చెందిన శ్రీ కృష్ణ మిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ను దొడ్ల డెయిరీ రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి శ్రీ కృష్ణ మిల్క్స్ టర్నోవర్ రూ.67.27 కోట్లు. వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణ మిల్క్స్ కొనుగోలు చేసినట్లు దొడ్ల డెయిరీ వెల్లడించింది. ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. రూ.50 కోట్లను నగదు రూపంలో చెల్లించి కర్ణాటక కంపెనీని సొంతం చేసుకున్నట్లు దొడ్ల డెయిరీ తెలిపింది.