శునకానికి పెద్దకర్మ

ABN , First Publish Date - 2021-09-02T00:35:14+05:30 IST

ఆత్మీయంగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో 12వ రోజున పెద్దకర్మ నిర్వహించి దానిపై తమ ప్రేమను చాటుకున్నారు.

శునకానికి పెద్దకర్మ

జగిత్యాల: ఆత్మీయంగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో 12వ రోజున పెద్దకర్మ నిర్వహించి దానిపై తమ ప్రేమను చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన కాలగిరి శ్రీనివాసరెడ్డి- సుమ దంపతులు ఆరేళ్లుగా మిల్కీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు.  అనారోగ్యంతో అది ఆగస్టు 21న మృతి చెందింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మూడవ, ఐదవ రోజు కార్యక్రమాలతో పాటు బుధవారం 12వ రోజు పెద్దకర్మ చేశారు. చుట్టు పక్కల వారికి భోజనాలు పెట్టారు. తమతో కలిసి ఉన్న శునకం మృతి చెందడం కలిచి వేసిందని ఆ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శునకానికి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి, పెద్దకర్మ జరపడం జగిత్యాలలో ఆసక్తికరంగా మారింది.


Updated Date - 2021-09-02T00:35:14+05:30 IST