లాక్డౌన్లో ఆకలితో అలమటిస్తున్న కుక్కలు... మహిళపై దాడిచేసి...
ABN , First Publish Date - 2020-05-20T12:52:29+05:30 IST
లాక్డౌన్లో ఆహారం దొరకక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. యూపీలోని కాన్పూర్లోగల కాకాదేవ్ ప్రాంతంలో ఆకలితో అల్లాడిపోతున్న వీధి కుక్కలు...
కాన్పూర్: లాక్డౌన్లో ఆహారం దొరకక మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. యూపీలోని కాన్పూర్లోగల కాకాదేవ్ ప్రాంతంలో ఆకలితో అల్లాడిపోతున్న వీధి కుక్కలు ఒక మహిళపై దాడిచేసి, చంపేశాయి. ఈ మహిళ మృతదేహం రోడ్డు పక్కన పడివున్న స్థితిలో పోలీసులు కనుగొన్నారు. దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. గత 2 నెలలుగా నడుస్తున్న లాక్డౌన్లో ఈ ప్రాంతంలోని వీధి కుక్కలకు ఆహారం లభించడం లేదని గీతానగర్ ప్రాంత ప్రజలు తెలిపారు. అలాగే ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ కారణంగానే కుక్కలు దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఈ ఉదంతం చోటుచేసుకున్న దరిమిలా పట్ణణంలోని మూగజీవాలకు ఆహారం అందించాలని మున్సిపల్ కమిషనర్కు డిఎం బ్రహ్మదేవ్ రామ్ తివారీ అధికారులను ఆదేశించారు.