దేశీ విమాన ప్రయాణికుల @: 21.07 లక్షలు
ABN , First Publish Date - 2020-08-14T07:51:53+05:30 IST
జూలై నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 21.07 లక్షలుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య ఏకంగా 82.3 శాతం తగ్గిందని డైరెక్టరేట్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది...
- గత ఏడాది జూలైతో పోల్చితే 82 శాతం తగ్గుదల: డీజీసీఏ
న్యూఢిల్లీ : జూలై నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 21.07 లక్షలుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ప్రయాణికుల సంఖ్య ఏకంగా 82.3 శాతం తగ్గిందని డైరెక్టరేట్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. కొవిడ్-19 కారణంగా దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. మరోవైపు విమానయాన సంస్థల కార్యకలాపాలు కూడా పరిమిత స్థాయిలో ఉండటం కూడా ఒక కారణమని తెలిపింది. కాగా జూలై నెలలో స్పైస్జెట్ ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉండగా ఇండిగో, గో ఎయిర్, విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిరిండియా విమానాల ఆక్యుపెన్సీ రేటు వరుసగా 60.2 శాతం, 50.5 శాతం, 53.1 శాతం, 56.2 శాతం, 45.5 శాతంగా ఉంది. జూన్ నెలలో ఈ విమాన సంస్థల్లో ఆక్యుపెన్సీ రేటు 50, 60 శాతంగా ఉంది. జూన్ నెలలో మొత్తం 19.84 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించారు.