సోషల్ మీడియా సంస్థలపై దుమ్మెత్తిపోసిన ట్రంప్
ABN , First Publish Date - 2020-05-28T13:12:32+05:30 IST
సోషల్ మీడియా సంస్థలను నియంత్రిస్తానని, అవసరమైతే వాటి మూసివేతకూ వెనుకాడనని ట్విటర్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.
సోషల్ మీడియా సంస్థలను మూసేస్తా: ట్రంప్
వాషింగ్టన్, మే 27: సోషల్ మీడియా సంస్థలను నియంత్రిస్తానని, అవసరమైతే వాటి మూసివేతకూ వెనుకాడనని ట్విటర్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ ట్వీట్లలో నిజానిజాలపై ట్విటర్ దృష్టి పెట్టిన నేపథ్యంలో వివాదం రాజుకుంది. సంప్రదాయవాదుల భావప్రకటనా స్వేచ్ఛను సోషల్ మీడియా సంస్థలు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ‘మెయిల్-ఇన్-ఓటింగ్ అన్నది అక్రమాలు, ఎన్నికల రిగ్గింగ్కు దారి తీస్తుంది. అందుకే మెయిల్-ఇన్-బ్యాలెట్లను పెద్దగా అనుమతించబోం’ అని ట్రంప్ రెండో ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్లు వాస్తవ విరుద్ధంగా, తప్పుదోవ పట్టించేలా ఉండటంతో ట్విటర్ వాటికి ఫ్యాక్ట్ చెక్ లేబుల్ను మార్క్ చేసింది. ట్రంప్ వైఖరిని ఖండించింది.