దళిత కుటుంబానికి కదిరి ఆర్థిక సహాయం
ABN , First Publish Date - 2021-03-06T06:02:44+05:30 IST
మండలంలోని దిరిశవంచ పంచాయతీ కమ్మవారిపల్లి ఎస్సీ పాలెంకు చెందిన ఒక దళిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు కదిరి బాబురావు రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు.
కనిగిరి, మార్చి 5: మండలంలోని దిరిశవంచ పంచాయతీ కమ్మవారిపల్లి ఎస్సీ పాలెంకు చెందిన ఒక దళిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు కదిరి బాబురావు రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు. కమ్మవారిపల్లి ఎస్సీపాలెంకు చెందిన కోలా కిషోర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన పిల్లలు అనాథలు కావడంతో గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న కదిరిబాబూరవుఉ, కిషోర్ కుమారులు సతీష్, శ్యామ్కుమార్లకు శుక్రవారం నగదును అందజేశారు.