రాజగోపురం నిర్మాణానికి విరాళం
ABN , First Publish Date - 2022-01-28T05:09:21+05:30 IST
పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణానికి కర్నాటక రాష్ట్రం విజయపూర్కు చెందిన శ్రీరామచంద్ర, వీరభద్రప్పగారి కుటుంబ సభ్యు లు రూ.25,116లు విరాళంగా అందజేశారు.
రాయచోటి, జనవరి 27: పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణానికి కర్నాటక రాష్ట్రం విజయపూర్కు చెందిన శ్రీరామచంద్ర, వీరభద్రప్పగారి కుటుంబ సభ్యు లు రూ.25,116లు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని దాతలు ఆన్లైన్ ద్వారా ఆలయ ఖాతాలో జమచేశారని ఆలయ ఈవో మంజుల, చైర్మన్ పోలంరెడ్డి విజయ తెలియజేశారు. అలాగే దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దాతల పేరుపై ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.