ఒడిశా సీఎం సహాయనిధికి మంత్రి విరాళం
ABN , First Publish Date - 2020-03-27T11:35:50+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణకు గాను ముఖ్యమంత్రి సహాయనిధికి రాయగడ జిల్లా బిసంకటక్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జగన్నాథ సారక
రాయగడ: కరోనా వైరస్ నియంత్రణకు గాను ముఖ్యమంత్రి సహాయనిధికి రాయగడ జిల్లా బిసంకటక్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జగన్నాథ సారక రూ.లక్ష ఐదు వేలు విరాళంగా అందజేశారు. జిల్లాలో ప్రజలంతా తమ వంతుగా విరాళాలు అందజేయాలని ప్రజాప్రతినిధులంతా కోరారు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలకా కరోనా కట్టకి గాను తన ఎంపీ ల్యాడ్ నిధుల నుంచి గురువారం రూ.కోటి కేటాయించారు. ఈ మేరకు రాయగడ, కొరాపుట్ జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. ఒక్కో జిల్లాకు రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ మొత్తంతో కరోనావైరస్ పరీక్షలకు కావలసిన వైద్య పరికరాలు, టెస్టింగ్ స్ర్కీనింగ్, యంత్రాలు కొనుగోలు చేయాలని, ఆసుపత్రి సిబ్బందికి అవసరమైన మాస్కులు, ఽథర్మల్ ఇమేజింగ్ స్కానర్లు కొనుగోలు చేయాలని లేఖలో పేర్కొన్నారు.