ఆర్డీటీకి, కొవిడ్‌ సెంటర్‌కు విరాళం

ABN , First Publish Date - 2021-05-17T06:12:26+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి సెకండ్‌వేవ్‌లో విజృంభిస్తున్న వేళ ఏపీ మీడియా ఎంప్లాయీస్‌ అసోసియేషన సభ్యులు తమ వంతుగా ప్రజలకు సేవ చేయ డానికి ముందుకొచ్చారు.

ఆర్డీటీకి, కొవిడ్‌ సెంటర్‌కు విరాళం
సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌కు విరాళం అందజేస్తున్న అసోసియేషన సభ్యులు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 16: కొవిడ్‌ మహమ్మారి సెకండ్‌వేవ్‌లో విజృంభిస్తున్న వేళ ఏపీ మీడియా ఎంప్లాయీస్‌ అసోసియేషన సభ్యులు తమ వంతుగా ప్రజలకు సేవ చేయ డానికి ముందుకొచ్చారు. ఆర్డీటీ చేపట్టిన ‘స్పందించు- ఆక్సిజన అందించు’ అనే నినాదంతో చేపట్టిన మిషన ఆక్సిజన కార్యక్రమానికి విరాళంగా రూ.21700 అందించారు. అసోసియేషన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డప్పరె డ్డి, టీ మహేంద్ర తదితరులు చెక్కును ఆదివారం ఆర్డీటీ స్థానిక ప్రధాన కార్యాలయంలో సంస్థ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాలఫెర్రర్‌కు అందజేశారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగమనేని కొవిడ్‌కేర్‌ సెంటర్‌కు విరాళంగా రూ.10116 చెకును సీపీఎం జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌కు అందజేశారు. 

ఆర్డీటీకి ఎంపీడీఓ విరాళం 

 స్పందించు ఆక్సిజన అందించూ అంటూ ఆర్డీటీ చేపట్టిన మిషన ఆక్సిజనకు డ్వామాలో పనచేస్తున్న ఎంపీడీఓ మంజునాథరావు దంపతు లు,  బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఇంజనీ రుగా పనిచేస్తున్న ఆయన కూతురు మానస చెరో రూ.25వేలు చొప్పున మొత్తం రూ.50వేలు విరాళంగా అందజేశారు. ఆర్డీటీ ఏడీ గంగప్పకు చెక్కులు అందజేశారు. 

రాప్తాడు, మే 16: ఆర్డీటీ చేపట్టిన స్పందించు ఆక్సిజన అందించు కార్యక్ర మానికి అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు రూ. 5 వేలను విరాళం అం దజేశారు.  రాప్తాడు ఆర్డీటీ ఏటీఎల్‌ వరకుమార్‌కు ఆదివారం అందజేశారు. 


Updated Date - 2021-05-17T06:12:26+05:30 IST