యాదాద్రి విమాన గోపురం బంగారు తాపడానికి విరాళాలు
ABN , First Publish Date - 2021-11-06T01:30:26+05:30 IST
యాదాద్రి ప్రధానాలయ విమానగోపురం బంగారు తాపడానికి పలువురు భక్తులు చెక్కుల రూపంలో విరాళాలను దేవస్థాన
యాదాద్రి: యాదాద్రి ప్రధానాలయ విమానగోపురం బంగారు తాపడానికి పలువురు భక్తులు చెక్కుల రూపంలో విరాళాలను దేవస్థాన ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వామివారి విమాన గోపురం బంగారు తాపడానికి సికింద్రాబాద్ అల్వాలకు చెందిన భక్తుడు పి.వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులు రూ.2,00,516, హైదరాబాద్ గ్రీన్హిల్స్ కాలనీకి చెందిన భక్తులు ఎం.సరస్వతీ గోవర్ధన్రావు రూ.5,11,116, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన భక్తుడు గడ్డమీది మాధవులుగౌడ్ రూ.51,116 విరాళాలను కొండపైన దేవస్థాన ప్రధాన కార్యాలయంలో ఈవో గీతారెడ్డికి అందజేశారు. శుక్రవారం స్వామివారిని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.