రామమందిరానికి విరాళాల వెల్లువ
ABN , First Publish Date - 2021-01-21T06:25:35+05:30 IST
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బీజేపీ నాయకురాలు, ఎస్ఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు సి.గోదావరీఅంజిరెడ్డి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
రామచంద్రాపురం, జనవరి 20: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బీజేపీ నాయకురాలు, ఎస్ఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు సి.గోదావరీఅంజిరెడ్డి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. బుధవారం సాయినగర్ సాయిబాబా ఆలయంలో ఆర్ఎ్సఎస్ కార్యక్రమంలో గోదావరీఅంజిరెడ్డి మాట్లాడుతూ రామాలయానికి సమృద్ధిగా విరాళాలు అందించాలన్నారు.
సంగారెడ్డి రూరల్: అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణానికి మండలంలోని పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గోపన్నగారి సుమంగళి చంద్రశేఖర్ విరాళాల సేకరణ కమిటీ సభ్యులకు రూ.51 వేల విరాళాన్ని అందజేశారు.
సదాశివపేట: జీర్లపల్లి వెంకన్న, శోభారాణి దంపతులు, కుటుంబసభ్యులు సంతో్షగుప్తా, సందీ్పగుప్తా, సంజయ్గుప్తా, అజయ్ గుప్తా రూ.51 వేల చెక్కును అందజేశారు.
కొండాపూర్: మల్కాపూర్కు చెందిన మండల టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఆర్.శ్రీనివా్సగౌడ్, మాజీ సర్పంచ్ సత్యమ్మ, మల్లేశం రూ.11 వేల చొప్పున విరాళాన్ని అందజేశారు.