సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
ABN , First Publish Date - 2020-04-09T11:33:14+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణకు బుధ వారం ప్రియామిల్క్ యజమాని రాంమోహన్రావు సీఎం సహాయ నిధికి ఐదులక్షల రూపా యల విరాళాన్ని నగర మేయర్ సునీల్రావుతో కలిసి కలెక్టర్
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 8: కరోనా వైరస్ నియంత్రణకు బుధ వారం ప్రియామిల్క్ యజమాని రాంమోహన్రావు సీఎం సహాయ నిధికి ఐదులక్షల రూపా యల విరాళాన్ని నగర మేయర్ సునీల్రావుతో కలిసి కలెక్టర్ శశాంకకు చెక్కును అందజేశారు. అరోరాడిగ్రీ కళాశాల కళాశాల చైర్మన్ మాదన వీరశేఖర్, డైరెక్టర్ ఎ దామోదర్రెడ్డి మేయర్ సునీల్రావు సమక్షంలో రూ.50వేల చెక్కును కలెక్టర్కు అందజేశారు. ఈసందర్భంగా దాతలను కలెక్టర్, మేయర్ అభినందించారు. లోటస్ హాస్పిటల్కు చెందిన వైద్యులు సంజయ్ మేయర్ సునీల్రావు, కమిషనర్ వల్లూరు క్రాంతికి 30వేలరూపాయల చెక్కును సీఎంసహాయనిధికి విరాళంగా అందించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్రెడ్డి 4,44,444 రూపాయల విరాళాన్ని బుధవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలిసి అందజేశారు.