కరోనా నివారణ నిధికి విరాళాలు

ABN , First Publish Date - 2020-03-30T10:35:34+05:30 IST

కరోనా వైరస్‌ నివారణ నిమిత్తం ప్రధానమంత్రి కేర్‌ ఖాతాకి రూ.లక్ష విరాళాన్ని ఉపాధ్యాయుడి కుటుంబం అందించి ఉదారత చాటుకుంది

కరోనా నివారణ నిధికి విరాళాలు

కె.కోటపాడు: కరోనా వైరస్‌ నివారణ నిమిత్తం ప్రధానమంత్రి కేర్‌ ఖాతాకి రూ.లక్ష విరాళాన్ని ఉపాధ్యాయుడి కుటుంబం అందించి ఉదారత చాటుకుంది. మండలంలోని కింతాడ శివారు జోగన్నపాలెంకి చెందిన బండారు ముత్యాలనాయుడు చీడికాడ మండలం అర్జునగిరి ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు బండారు నరేష్‌ అక్కౌంట్‌ నుంచి లక్ష రూపాయల విరాళాన్ని ప్రధానమంత్రి కేర్‌ ఖాతాకి ఆన్‌లైన్‌లో జమ చేశారు. ఈ కుటుంబాన్ని పలువురు అభినందిస్తున్నారు.


ఉమ్మలాడ వాసి రూ.50వేలు..

మునగపాక: కరోనా బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉమ్మలాడ గ్రామానికి చెందిన సూరిశెట్టి రామకృష్ణ రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ఆదివారం తహసీల్దార్‌ మురళీకృష్ణకు అందజేశారు.

Updated Date - 2020-03-30T10:35:34+05:30 IST