స్టీల్ ప్లాంట్ కోసం హైకోర్టులో పిల్.. కేఏ పాల్ చిత్రపటానికి పాలాభిషేకం
ABN , First Publish Date - 2021-03-05T18:12:34+05:30 IST
విశాఖ: కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర కేఏ పాల్ చిత్ర పటానికి స్టీల్ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.
అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ హైకోర్టులో మత గురువు కేఏ పాల్ పిల్ వేశారు. ఈ సందర్భంగా జీపీఏ ద్వారా పిల్ వేయవచ్చా అని ధర్మాసనం ప్రశ్నించింది. రూల్ నెం.4 ద్వారా పిల్ వేయవచ్చని ధర్మాసనానికి న్యాయవాది యలమంజుల బాలాజీ తెలిపారు. కేఏపాల్ అన్ని దేశాల్లో పర్యటిస్తుండటం వల్ల జీపీఏ ద్వారా వేశామని కోర్టుకు విన్నవించారు. జీపీఏ ద్వారా పిల్ వేయవచ్చా లేదా అనేది వచ్చే వారం నిర్ణయిస్తామని హైకోర్టు పేర్కొంది.
ఇదిలా ఉంటే, కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర కేఏ పాల్ చిత్ర పటానికి స్టీల్ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ వేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ.. చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.