దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-11-29T04:37:41+05:30 IST

పట్టణంలోని పలు కాలనీలలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసిన్నట్లు సీఐ స్వామి విలేకరులకు వెల్లడించారు.

దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

భద్రాచలంటౌన్‌, నవంబరు 28: పట్టణంలోని పలు కాలనీలలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసిన్నట్లు సీఐ స్వామి విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని పెట్రోలింగ్‌ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్టేషన్‌కు తరలించి విచారించగా ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ మండపోడు గ్రామానికి చెందిన వేములపల్లి శివకుమార్‌, వేములపల్లి విజయ్‌కుమార్‌ గుర్తించడంతో పాటు వీరు పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడిన్నట్లు తేలిన్నట్లు సీఐ పేర్కొన్నారు. దీంతో నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి ఒకటిన్నర తులాల బంగారు చైన్‌, రూ.20 వేలు, 75గ్రాముల వెండి పట్టీలు, ఒక రెడ్‌మీ స్మార్ట్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T04:37:41+05:30 IST