నేను PM Modiని అనుసరిస్తున్నందున ముసుగు ధరించ లేదు...
ABN , First Publish Date - 2021-12-31T15:01:02+05:30 IST
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు...
శివసేన నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
నాసిక్ (మహారాష్ట్ర): శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోదీ మాస్కు ధరించకపోవడాన్ని నిందించారు. తాను ప్రధాని నరేంద్రమోదీని అనుసరిస్తున్నందున, తాను కూడా మాస్కు ధరించడం లేదని సంజయ్ పేర్కొన్నారు.సంజయ్ రౌత్ నాసిక్ నగరంలోని బహిరంగ సభలో మాస్కు లేకుండా ప్రసంగించారు.మీరు మాస్కు ఎందుకు ధరించడం లేదని అడిగినప్పుడు, సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రధానమంత్రి మోదీ మాస్కులు ధరించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు, కానీ ఆయన స్వయంగా మాస్కు ధరించరు. మేమంతా ప్రధానిని అనుసరిస్తాం కాబట్టి, నేను కూడా ముఖానికి మాస్క్ ధరించలేదు’’ అని సంజయ్ రౌత్ చెప్పారు.
మహారాష్ట్రలో కరోనా, ఒమైక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, మాస్కు గురించి శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు.కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా కరోనా మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు జనవరి 7 వరకు ముంబైలో 144 సెక్షన్ విధించారు.