భయపడకండి.. అండగా ఉంటా : వైకుంఠం

ABN , First Publish Date - 2021-09-18T06:16:03+05:30 IST

ఎవరూ భయపడాల్సిన పనిలేదని, మీకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి అనంత ని యోజకవర్గ టీడీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.

భయపడకండి.. అండగా ఉంటా : వైకుంఠం
మాసూలు శ్రీనివాసులును పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రభాకరచౌదరి

అనంతపురం వైద్యం సెప్టెంబరు 17 : ఎవరూ భయపడాల్సిన పనిలేదని, మీకు అండగా ఉంటానని  మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి అనంత ని యోజకవర్గ టీడీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుపోటములు సహజమని, అందరం కష్టపడి పని చేస్తే మళ్లీ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుం దన్నారు. టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి స్వప్న, టీడీపీ ఉపాధ్యక్షుడు డిష్‌ నాగరాజు, నారాయణస్వామియాదవ్‌, టీడీపీ అధికార ప్రతినిధి సరిపూటి రమణ, పార్టీ కార్యాలయ కార్యదర్శి రాయల్‌ కొండయ్యలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మారుతిగౌడ్‌, దేవల్ల మురళి, సుధాకరయాదవ్‌, మహేశ, ముక్తియార్‌, భవాని, వెంకటే్‌షగౌడ్‌, గోపాల్‌గౌడ్‌, వెంకటకృష్ణా, విజయశ్రీ పాల్గొన్నారు.


టీడీపీలోకి శ్రీనివాసులు : తెలుగుదేశం పార్టీలోకి మాసూలు శ్రీనివాసులు చేరారు. ప్రభాకరచౌదరి ఆయనకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు.


Updated Date - 2021-09-18T06:16:03+05:30 IST