అమరావతిని కదలనివ్వొద్దు
ABN , First Publish Date - 2020-07-02T09:49:05+05:30 IST
అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదలనివ్వొద్దంటూ 1,080 కొబ్బరికాయలతో గణేషుడికి
1,080 కొబ్బరికాయలతో గణేషుడికి పూజలు
197వ రోజూ కొనసాగిన అమరావతి ఆందోళనలు
గుంటూరు, ఆంధ్రజ్యోతి/తాడికొండ/తుళ్లూరు, జూలై 1 : అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదలనివ్వొద్దంటూ 1,080 కొబ్బరికాయలతో గణేషుడికి అమరావతి రైతులు, మహిళలు బుధవారం పూజలు చేశారు. అమరావతి రైతుల ఆందోళనలు 197వ రోజుకు చేరాయి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమరావతికి ఎదురవుతున్న విఘ్నాలను తొలగించు విఘ్నేశా.. అంటూ మందడంలోని వరసిద్ధి వినాయక ఆలయంలో 1,080 కొబ్బరికాయలు కొట్టారు.
కృష్ణాయపాలెంలోని విఘ్నేశ్వరుడి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగించారు. అనంతరం రైతులు, మహిళలు, కూలీలు ‘ఇంటింటా అమరావతి’ ఆందోళన నిర్వహించారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం చేపట్టారు. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు మహిళలు, రైతులు, చిన్నారులు నిరసన చేపట్టారు.