ఢిల్లీ కంటైన్మెంట్‌ జోన్లలో ఇంటింటి సర్వే పూర్తి!

ABN , First Publish Date - 2020-07-08T03:58:13+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే పూర్తైనట్టు అధికారులు తెలిపారు.

ఢిల్లీ కంటైన్మెంట్‌ జోన్లలో ఇంటింటి సర్వే పూర్తి!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే పూర్తైనట్టు అధికారులు తెలిపారు. మొత్తం 445 కంటైన్మెంట్‌ జోన్లలో ఈ సర్వే చేపట్టామన్నారు. ఇందులో భాగంగా దాదాపు 3.68 లక్షల మందిని కలసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నామని పేర్కొన్నారు. 1.66 లక్షలకు పైగా కరోనా యాంటీజెన్ పరీక్షలు కూడా చేశామని తెలిపారు. జూన్ 30న ఈ సర్వే పూర్తి చేయాలని తొలుత అధికారులు లక్ష్యాన్ని విధించుకున్నప్పటికీ కాస్తంత ఆలస్యంగా ఇది పూర్తయింది. ఇక కొత్త నిబంధనల ప్రకారం విస్తృతమైన కంటైన్మెంట్ జోన్లు స్థానంలో విస్తీర్ణం కాస్తంత తక్కువగా ఉండే మైక్రో కంటైన్మెంట్ జోన్ల గుర్తింపుకు ప్రభుత్వం పూనుకుంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని నగరమంతటికీ విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-07-08T03:58:13+05:30 IST