డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు Dopam యాప్: పోలీస్ శాఖ
ABN , First Publish Date - 2022-01-28T20:34:00+05:30 IST
రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు డోపమ్ (Dopam) యాప్ను
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు డోపమ్ (Dopam) యాప్ను పోలీసులు రూపొందించారు. డ్రగ్స్ వ్యవహారంపై డీజీపీ మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. డీజీపీ సమావేశంలో కీలక ప్రతిపాదనలను సిద్ధం చేశారు. డ్రగ్స్ విక్రయదారులు, వినియోగదారుల చిట్టాను రెడీ చేశారు. గతంలో డ్రగ్స్ తీసుకున్నవారి పేర్లతో చిట్టాను పోలీసులు రూపొందించారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు, విద్యార్థులకు సంబంధించిన పేర్లతో చిట్టా తయారయింది. గంజాయి తీసుకున్నవారి వివరాలనూ పోలీస్శాఖ పొందుపర్చింది. డ్రగ్స్ విక్రయాలపై నిఘాకు Dopam యాప్ను పోలీసులు రూపొందించారు. డ్రగ్స్కు సంబంధించి గత పదేళ్ల డేటాను పోలీస్ శాఖ తయారు చేసింది.