అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-06-18T04:24:30+05:30 IST

నియోజకవర్గంలోని అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను అందజేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు భరోసా ఇచ్చారు.

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు: ఎమ్మెల్యే
పారిశుధ్య కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, జూన్‌ 17: నియోజకవర్గంలోని అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను అందజేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు భరోసా ఇచ్చారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన పారిశుధ్య కార్మికులకు తప్పకుండా డబుల్‌బెడ్‌రూం ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పెంచిన 30 శాతం పీఆర్‌సీ వేతనాన్ని ఈ నెల నుంచే అందజేసేలా ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు. సిద్దిపేటలోని ఈఎ్‌సఐ ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు వైద్యసేవలు అందేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు ఆయన సన్మానించారు. ఎమ్మెల్యే రఘునందన్‌ వెంట బీజేపీ నాయకులు తదితరులున్నారు. 


 

Updated Date - 2021-06-18T04:24:30+05:30 IST