Double bedroom ఇళ్లు ఇప్పిస్తామని వసూళ్లు.. మహిళ అరెస్ట్

ABN , First Publish Date - 2021-07-15T14:51:54+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేసిన...

Double bedroom ఇళ్లు ఇప్పిస్తామని వసూళ్లు.. మహిళ అరెస్ట్

  • మహిళను అరెస్టు చేసిన పోలీసులు


హైదరాబాద్ సిటీ/బేగంపేట : డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడీని సనత్‌నగర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బోరబండలోని సైట్‌-3లో సుప్రియ నివాసం ఉంటుంది. కొంతకాలంగా అల్లాపూర్‌తోపాటు పలు ప్రాంతాలకు చెందిన పలువురి మహిళల నుంచి డబుల్‌ బెడ్‌రూంలు ఇప్పిస్తానని  రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసింది. సంవత్సరాలు గడుస్తున్నా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు రాకపోవడంతో బాధితులు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుప్రియతోపాటు మరో మహిళపై కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో ఉన్న మరో మహిళను నగరంలోని మరో పోలీస్‌ స్టేషన్‌లో ఇలాంటి కేసులోనే అరెస్టు చేశారని, విచారణ కోసం తీసుకువస్తామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-15T14:51:54+05:30 IST