ఆకాశంలో ఒకేసారి రెండు ఇంద్రధనసులు.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2020-06-01T04:09:04+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం వర్షంకురిసింది. దీంతో ఆకాశంలో ఇంద్రధనసు ప్రత్యక్షమైంది.

ఆకాశంలో ఒకేసారి రెండు ఇంద్రధనసులు.. ఫొటోలు వైరల్

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం వర్షంకురిసింది. దీంతో ఆకాశంలో ఇంద్రధనసు ప్రత్యక్షమైంది. దీనిలో మరో వింతేమిటంటే.. ఇక్కడ ఒకేసారి రెండు ఇంద్రధనసులు కనిపించాయి. ఇక్కడే కాదు హరియాణా రాష్ట్రంలో కూడా పలుచోట్ల ఇలానే రెండు రెయిన్‌బోలు ప్రజలకు కనువిందు చేశాయి. వీటిని చూసిన చాలామంది ఔత్సాహికులు.. ఈ అద్భుతాన్ని కెమెరాలో బంధించారు. వారు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి బాగా వైరలయ్యాయి. ‘ఒకేసారి రెండు రెయిన్‌బోలు కనిపించడం చాలా అద్భుతంగా ఉంది’ అంటూ నెటిజన్లు ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Updated Date - 2020-06-01T04:09:04+05:30 IST