10.90 అడుగులకు పెరిగిన ధవళేశ్వరం బ్యారేజ్ నీటిమట్టం
ABN , First Publish Date - 2021-07-14T13:22:46+05:30 IST
ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.
రాజమండ్రి: ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 10.90 అడుగులకు మేర నీటిమట్టం పెరిగింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 6,600 క్యూసెక్కుల సాగునీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. మరోవైపు లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి విడుదల చేశారు.