ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటి ప్రవాహం

ABN , First Publish Date - 2021-07-12T17:13:41+05:30 IST

: రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటి ప్రవాహం

రాజమండ్రి: రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగవ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద  నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.  ప్రస్తుతం బ్యారేజ్ నీటిమట్టం 10.90 అడుగుల వద్ద కొనసాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 12 వేల క్యూసెక్కుల సాగునీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. దాదాపు30 వేల క్యూసెక్కుల నీటిని వృధాగా సముద్రంలోకి విడుదల చేశారు.

Updated Date - 2021-07-12T17:13:41+05:30 IST