ధవళేశ్వరం బ్యారేజ్‌ నీటిమట్టం 9.40 అడుగులు

ABN , First Publish Date - 2020-08-13T13:59:47+05:30 IST

భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది.

ధవళేశ్వరం బ్యారేజ్‌ నీటిమట్టం 9.40 అడుగులు

రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం కాటన్  బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 9.40 అడుగులకు పెరిగింది. ఈ క్రమంలో అధికారులు 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేసి 4.05 లక్షలు  క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు 10,500 క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేశారు.

Updated Date - 2020-08-13T13:59:47+05:30 IST