దవళేశ్వరం బ్యారేజి వద్ద స్వల్పంగా కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2021-07-21T13:43:22+05:30 IST
రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది.
రాజమండ్రి: రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో దవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది. అటు పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ బ్యాక్ వాటర్ కారణంగా దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.