వృద్ధాశ్రమంలో డాక్టర్ ఆనంద్, పరిమళ అన్నదానం
ABN , First Publish Date - 2021-02-24T21:36:48+05:30 IST
దివంగత ఆదిరాజు రమాదేవి జ్ఞాపకార్థం, పరిమళ లక్ష్మి సహాయ సహకారాలతో
హైదరాబాద్: దివంగత ఆదిరాజు రమాదేవి జ్ఞాపకార్థం, పరిమళ లక్ష్మి సహాయ సహకారాలతో ప్రముఖ వైద్యుడు, సామాజిక కార్యకర్త డాక్టర్ ఆనంద్ నేతృత్వంలోని బంజారా మహిళా యన్జీవో తరుపున రాంపల్లి ప్రాంతంలో ఉన్న తులసి వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సుమారు 150 మందికి అన్నదానం ఏర్పాట్లు జరిగాయి. కోవిడ్ కష్టకాలంలో అనేక అనాథ, వృద్ధాశ్రమాలకు డాక్టర్ ఆనంద్ మిత్ర బృందం నిత్యావసర వస్తువులను అందజేసింది.