సరోజిని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ నజాఫి బేగమ్కు కలాం ఎక్సలెన్స్ అవార్డ్
ABN , First Publish Date - 2021-07-31T01:07:22+05:30 IST
హైదరాబాద్: మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి సివిల్ సర్జన్, ఆర్ఎంఓ డాక్టర్ నజాఫి బేగమ్కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది.
హైదరాబాద్: మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి సివిల్ సర్జన్, ఆర్ఎంఓ డాక్టర్ నజాఫి బేగమ్కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. వైద్యరంగానికి ఆమె అందించిన సేవలకు గాను యాక్ట్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్స్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. డాక్టర్ నజాఫి బేగమ్ 29 సంవత్సరాలుగా వైద్య సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 29 ఏళ్ల క్రితం ఆమె ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సివిల్ సర్జన్, ఆర్ఎంఓ స్థాయికి చేరుకున్నారు. డాక్టర్ నజాఫి బేగమ్కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్ లభించడంపై ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.