గ్రామీణ వైద్యులు చికిత్స చేయకూడదు : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2020-04-04T10:27:45+05:30 IST

జిల్లాలో పనిచేస్తున్న గ్రామీణ వైద్యులు (ఆర్‌ఎంపీ, పీఎంపీలు) ఎలాంటి వైద్య చికిత్సలు అందించకూడదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి హెచ్చరించారు.

గ్రామీణ వైద్యులు చికిత్స చేయకూడదు : డీఎంహెచ్‌వో

నెల్లూరు (వైద్యం)ఏప్రిల్‌ 3 : జిల్లాలో పనిచేస్తున్న గ్రామీణ వైద్యులు (ఆర్‌ఎంపీ, పీఎంపీలు) ఎలాంటి వైద్య చికిత్సలు అందించకూడదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్‌ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం జడ్పీలోని ఎమర్జెన్సీ కేంద్రంలో పీఎంపీ, ఆర్‌ఎంపీలు డీఎంహెచ్‌వోను కలిసి కరనా నివారణకు చే యూత ఇస్తామని వారి జాబితాను అందచేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్ర స్తుతం కరోనా ప్రభావం నేపథ్యంలో ఎవ్వరూ ప్రాఽథమిక చికిత్స చేయరాదని చె ప్పారు.


ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్లు గుర్తిస్తే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని సూచించారు. ఎవరైనా పీఎంపీ, ఆర్‌ఎంపీలు ప్రాఽథమిక చికిత్స చే స్తే చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నియంత్రణకు తమ వంతు సహకారం అందిసామని అసోసియేషన్‌ నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్‌, ఆర్‌ఎంపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ర వీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:27:45+05:30 IST