డా. సుధాకర్ కుటుంబాన్ని వేధిస్తున్న వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-13T20:52:30+05:30 IST

వేధింపులతో డాక్టర్ సుధాకర్‌ను బలితీసుకున్న వైసీపీ నేతలు అతని కుటుంబాన్నీ వదలడంలేదు.

డా. సుధాకర్ కుటుంబాన్ని వేధిస్తున్న వైసీపీ నేతలు

విశాఖ: వేధింపులతో డాక్టర్ సుధాకర్‌ను బలితీసుకున్న వైసీపీ నేతలు అతని కుటుంబాన్నీ వదలడంలేదు. తన మేనల్లుడిని రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పుతున్నారని డాక్టర్ సుధాకర్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోకి చొరపడిన మేనల్లుడు తలుపులు వేసుకుని హై డ్రామా చేశాడు. పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. చివరికి పోలీసులు వచ్చి అతనిని బయటకు తీసుకువచ్చారు.


పెందుర్తి ఎమ్మెల్యే అదిప్ రాజుతోపాటు మరికొంతమంది తమ భూములు లాక్కున్నారని డా. సుధాకర్ తల్లి ఆరోపించారు. తన మేనల్లుడు విజయ్‌ను రెచ్చగొట్టి గొడవ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-13T20:52:30+05:30 IST