అదనపు సీఈగా డాక్టర్ వరప్రభాకర్
ABN , First Publish Date - 2021-01-26T05:24:20+05:30 IST
వైవీ యూనివర్శిటీ పరీక్షల నిర్వహణ అదనపు అధికారిగా (సీఈ) డాక్టర్ వెంకట వరప్రభాకర్ను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు.
కడప(వైవీయూ), జనవరి 25: వైవీ యూనివర్శిటీ పరీక్షల నిర్వహణ అదనపు అధికారిగా (సీఈ) డాక్టర్ వెంకట వరప్రభాకర్ను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. వరప్రభాకర్ వైవీయూనివర్శిటీ ఎంబీఏ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఇదివరకు ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వీసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.